అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్గా గ్రెగ్ బార్క్లే మరోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. న్యూజిలాండ్కు చెందిన గ్రెగ్ బార్క్లే ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఈ ఏడాది నవంబర్ నెలతో ఆయన పదవీకాలం ముగియనుండగా మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. జింబాబ్వేకు చెందిన తవెంగ్వా ముకుహ్లానీ పోటీ నుండి అనూహ్యంగా వైదొలిగిన తర్వాత బార్క్లే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ బోర్డు అతనికి మరో రెండు సంవత్సరాలు అధ్యక్షుడిగా కొనసాగేందుకు పూర్తి మద్దతును తెలిపింది. బీసీసీఐ సహా మొత్తం 17 ఐసీసీ సభ్యదేశాలు ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాగా గ్రెగ్ గతంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్గా.. అలాగే 2015లో ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ డైరెక్టర్గా వ్యవహరించారు.
ఇక ఐసీసీ ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం గ్రెగ్ బార్క్లే స్పందిస్తూ.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్గా తిరిగి ఎన్నిక కావడం గౌరవంగా భావిస్తున్నానని, తనకు మద్దతు తెలిపిన ఐసీసీ డైరెక్టర్లు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే క్రికెట్ క్రీడను ప్రోత్సహించడంలో మరియు దాని భవిష్యత్తు కోసం రోడ్మ్యాప్ను రూపొందించడంలో తన వంతు పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల్లో క్రికెట్ ఆటకు సంబంధించి గ్లోబల్ గ్రోత్ స్ట్రాటజీని ప్రారంభించడం ద్వారా గణనీయమైన పురోగతిని సాధించామని, ఇది క్రీడకు విజయవంతమైన మరియు స్థిరమైన భవిష్యత్తును నిర్మించడానికి స్పష్టమైన దిశను అందిస్తుందని బార్క్లే స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE