భారత్-వెస్టిండీస్ మధ్య మూడో వన్డే నేడు జరగనుంది. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే మొదటి రెండు వన్డేలు గెలిచిన భారత్ తాజాగా మూడోవన్డే కూడా గెలిచి క్లీన్స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. సీనియర్ బ్యాట్సమన్ శిఖర్ ధవన్ కరోనా నుంచి కోలుకుని జట్టుతో చేరాడు. దీంతో భారత్ బ్యాటింగ్ లైనప్ మరింత బలం పుంజుకుంది. అయితే, వెటరన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ జట్టుకి ఆందోళన కలిగిస్తోంది. మొదటి రెండు వన్డేలలో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించటంలో మునుపటి జోరు చూపించలేకపోతున్నాడు. ఈ మ్యాచ్ లోనైనా విరాట్ భారీ స్కోరు సాధించాలని జట్టు భావిస్తోంది.
అయితే, ఈ సిరీస్ లో టీమిండియా బౌలర్లు అసాధారణ ప్రదర్శన చేస్తున్నారు. యువ ఆటగాళ్లు ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, చాహల్ అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే, మరోవైపు వెస్టిండీస్ పరువు కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. మంచి హార్డ్ హిట్టర్స్ ఉన్న ఆ జట్టు బ్యాటింగ్ ఆశించినమేరకు రాణించటం లేదు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి క్లీన్స్వీప్ తప్పించుకోవాలని విండీస్ భావిస్తోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గం.కు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్లో ప్రసారం కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ