టర్కీ, గ్రీస్ దేశాలలో శుక్రవారం నాడు భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 7.0 గా నమోదైనట్టు వెల్లడించారు. ముఖ్యంగా పశ్చిమ టర్కీలోని ఇజ్మిర్ నగరంలో పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇక శిధిలాల కింద చిక్కుకుపోయినవారిపై ఇంకా సమాచారం లేదని ఆ నగర మేయర్ వెల్లడించారు. అలాగే భూకంపం దాటికి ఏజియన్ సముద్రంలో చిన్నపాటి సునామీ సంభవించడంతో నగర విధుల్లోకి నీరు చేరుకున్నాయి. మరోవైపు గ్రీస్ రాజధాని ఏథెన్స్, సామోస్ ప్రాంతాలలోనూ భూకంపం రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సామోస్ ప్రజలను కోస్టల్ ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu