మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గురువారం కొత్తగా 2,678 పాజిటివ్ కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 79,95,729 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో ఎనిమిది మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,47,964 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 3,238 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 78,28,352 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 19,413 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. అయితే జూలై 7న నాగ్పూర్ డివిజన్లో 20 మందికి BA 2.75 వేరియంట్ నిర్ధారణ కావడంతో, ఇప్పటికీ ఆ కేసుల సంఖ్య 30కి చేరినట్టు తెలిపారు. ఈ 20 మంది శాంపిల్స్ ను జూన్ 15 నుంచి జూలై 5 మధ్య తీసుకున్నామని, ఇందులో 11 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారని తెలిపారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (జూలై 7, గురువారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 8,22,63,482
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 79,95,729
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 78,28,352
- కరోనా రికవరీ రేటు – 97.91%
- యాక్టీవ్ కేసులు – 19,413
- జూలై 7న నమోదైన కేసులు – 2,678
- జూలై 7న డిశ్చార్జ్ అయినవారు – 3,238
- జూలై 7న నమోదైన మరణాలు – 8
- మొత్తం మరణాల సంఖ్య – 1,47,964
- కరోనా మరణాలు రేటు – 1.85%
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY