భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే కరోనాతో 1092 మంది మృతి చెందగా, మరో 64531 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు నమోదవడం ఆందోళనగా మారింది. దేశంలో మరణాల రేటు 1.91 శాతం ఉండగా, ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఆగస్టు 19, బుధవారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 27,67,673 కు, మరణాల సంఖ్య 52889 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరోవైపు కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో 60,091 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 20,37,870 కు చేరుకుంది. దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నపటికి, కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 73.64 శాతంగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 6,76,514 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu