ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 19, బుధవారం నాడు తాడేపల్లి బోట్ హౌస్ వద్ద వైఎస్ఆర్ హౌసింగ్ పథకం కింద నిర్మించిన మోడల్ హౌస్ను పరిశీలించారు. గృహ నిర్మాణ శాఖ నిర్మించిన ఈ మోడల్ హౌస్ కు సంబంధించిన అన్ని వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. 2.5 లక్షల వ్యయంతో 40 గజాల విస్తీర్ణంలో హాల్, బెడ్రూమ్, కిచెన్, వరండాలతో ఈ మోడల్ హౌస్ నిర్మించినట్టు అధికారులు తెలిపారు. సెంటు స్థలంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ఇంటి నిర్మాణం ఎలా చేపట్టారో ఈ సందర్భంగా అధికారులు సీఎం వైఎస్ జగన్ కు వివరించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu