భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. పలు రాష్ట్రాల్లో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 89706 పాజిటివ్ కేసులు నమోదవగా, 1115 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 8, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 43,70,128 కు, మరణాల సంఖ్య 73,890 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ఇటీవల రోజుకి 1000 కి పైగానే కరోనా మరణాలు నమోదవడం ఆందోళనగా మారింది. దేశంలో మరణాల రేటు 1.7 శాతం ఉండగా, ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
మరోవైపు గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 74,894 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 33,98,844 కు చేరుకోవడంతో కరోనా రికవరీ రేటు 77.8 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లో 8,97,394 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇక గత 24 గంటల్లో 11,54,549 కరోనా పరీక్షలు నిర్వహించగా, దేశంలో ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 5,18,04,677 కు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu