దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు: ఒక్కరోజే 38902 మందికి కరోనా పాజిటివ్, 543 మరణాలు నమోదు

Coronavirus Cases In India, Coronavirus Deaths In India, Coronavirus In India, Coronavirus in India live updates, Coronavirus Live Updates, Coronavirus outbreak, coronavirus positive cases, Coronavirus Positive Cases In India, Covid-19 in India, india coronavirus cases, india coronavirus deaths, Total Corona Cases In India

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. జూలై 19, ఆదివారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10,77,618 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 38902 కరోనా పాజిటివ్ కేసులు, 543 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఒకరోజు వ్యవధిలో అత్యధికంగా ఇన్ని కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అయితే గత ఐదు రోజులుగా ప్రతిరోజూ 30 వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి.

అలాగే దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 26,816 కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 6,77,423 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 3,73,379 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నపటికి కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 63 శాతంగా ఉంది. మరోవైపు అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ మూడోస్థానంలో కొనసాగుతోంది. అలాగే కరోనా మరణాల్లో‌ ఎనిమిదో స్థానంలో ఉంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =