తెలంగాణ రాష్ట్రంలో మరో 1284 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూలై 18, శనివారం సాయంత్రం 5 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 43,780 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 14,883 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో 6 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 409 కి పెరిగినట్టు తెలిపారు. కాగా రాష్ట్రంలో మరణాల రేటు 0.93 (< 1%) శాతంగా ఉంది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 1,902 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 30,607 కి చేరింది. దీంతో రికవరీ రేటు 70 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం 12,765 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 667, సంగారెడ్డిలో 86, రంగారెడ్డిలో 68, మేడ్చల్లో 62, కరీంనగర్ లో 58, నల్గొండలో 46, వరంగల్ అర్బన్లో 37, వికారాబాద్లో 35, నిజామాబాద్లో 26, వనపర్తిలో 24, సూర్యాపేటలో 23, సిద్దిపేటలో 22, మంచిర్యాలలో 19, మహబూబ్నగర్లో 16, మెదక్లో 15, పెద్దపల్లిలో 14, జోగుళాంబ గద్వాలలో 14, ఖమ్మంలో 10, యాదాద్రి భువనగిరిలో 10 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu