రోజురోజుకి కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 9 లక్షలు దాటింది. అలాగే కరోనా మరణాల సంఖ్య కూడా 23,727 కు చేరుకుంది. జూలై 14, మంగళవారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9,06,752 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 28,498 కరోనా పాజిటివ్ కేసులు, 553 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా బాధితుల రికవరీ రేటు 63.02 శాతానికి పెరిగింది. అలాగే కరోనా మరణాల రేటు 2.64 శాతంగా ఉంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 14, ఉదయం 8 గంటల వరకు) :
దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 9,06,752
కొత్తగా నమోదైన కేసులు (జూలై 13 – జూలై 14 (8AM-8AM) : 28,498
నమోదైన మరణాలు : 553
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 5,71,460
యాక్టీవ్ కేసులు : 3,11,565
మొత్తం మరణాల సంఖ్య : 23,727
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu