తెలంగాణలో ఇటీవల వరుసగా పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ నేత, జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల కాలంలో నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకుని, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను” ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF