దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 171 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,80,386 కు చేరుకుంది. కాగా కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,722గా ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 38, కర్ణాటకలో 36, మహారాష్ట్రలో 24, పాండిచ్చేరిలో 21, తమిళనాడులో 8 నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, జనవరి 11, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 91,25,43,032
- జనవరి 10న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,80,926
- కొత్తగా నమోదైన కేసులు [జనవరి 9–జనవరి 10 (8AM-8AM)] : 171
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,46,80,386
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 148
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,47,322
- కరోనా రికవరీ రేటు : 98.80 శాతం
- యాక్టీవ్ కేసులు : 2,342 (0.01 శాతం)
- కొత్తగా నమోదైన మరణాలు : 0
- మొత్తం మరణాల సంఖ్య : 5,30,722
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE