చిరు వ్యాపారులు వారి కష్టం పైనే ఆధారపడతారని, అందుకే వారికి పెట్టుబడి సాయం అందించేందుకే ‘జగనన్న తోడు’ పథకం తీసుకొచ్చామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన జగనన్న తోడు పథకం కింద 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.395 కోట్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా పాల్గొన్న సీఎం జగన్ ఈ సందర్భంగా లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కాకముందు తాను చేపట్టిన పాదయాత్రలో వీధి వ్యాపారుల కష్టాలు దగ్గరగా చూశానని, వారు సమాజానికి గొప్ప మేలు చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే వారికి పెట్టుబడి మొత్తం కష్టం కాకూడదనే, జగనన్న తోడు పథకం కింద వ్యాపారులకు ఒక్కొక్కరికీ రూ.10 వేలు వడ్డీలేని రుణం అందిస్తున్నామని తెలిపారు. అర్హత ఉండి పథకం దక్కని వారికి ఈరోజు వారి ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని, అలాగే గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ను కూడా అందిస్తున్నామని వెల్లడించారు.
కాగా జగనన్న తోడు పథకం నిబంధనల ప్రకారం.. గ్రామాలు, పట్టణాల్లో దాదాపు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ఉన్న స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు. ఇంకా ఫుట్ పాత్లు, వీధుల్లో తోపుడు బండ్లపైన పండ్లు, కూరగాయలు అమ్ముకుంటూ జీవించేవారు కూడా అర్హత కలిగి ఉంటారు. అలాగే బుట్టలు, సైకిళ్లు, మోటారు వాహనాలు మరియు ఆటోలలో వస్తువులను విక్రయించే వ్యక్తులకు ఇది వర్తిస్తుంది. వీరితో పాటు కొండపల్లి బొమ్మల తయారీ, జరీ పనులు, కలంకారి, తోలుబొమ్మలు, కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడిన వారు కూడా జగనన్న తోడు పథకానికి అర్హులని ఏపీ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE