భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసులు 40 రోజుల తర్వాత 2 లక్షల కంటే తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,96,427 పాజిటివ్ కేసులు నమోదవగా, 3511 మంది మరణించారు. దీంతో మే 25, మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,69,48,874 కు, మరణాల సంఖ్య 3,07,231 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల వ్యవధిలో 3,26,850 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 2,40,54,861 కు చేరుకుంది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 89.26 శాతం గానూ, మరణాల రేటు 1.14 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 25,86,782 (09.60%) మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ