ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఇటీవలే కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా జూనియర్ ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో ఫలితం నెగెటివ్ గా వచ్చింది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నాకు కోవిడ్-19 పరీక్షలో నెగటివ్ వచ్చిందని చెప్పడం ఆనందంగా ఉంది. త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి, నా కజిన్ డాక్టర్ వీరు, అలాగే టెనెట్ డయాగ్నోస్టిక్స్ కు కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను. వారి అద్భుతమైన సంరక్షణ నాకు చాలా సహాయపడింది” అని ఎన్టీఆర్ తెలిపారు.
“కోవిడ్-19 వ్యాధిని చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ వ్యాధిని మంచి జాగ్రత్తలతో మరియు పాజిటివ్ ఆలోచనలతో జయించవచ్చు. ఈ వ్యాధిపై పోరాటంలో మీ సంకల్ప శక్తి మీ అతిపెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండండి. ఆందోళన పడకండి. అలాగే మాస్క్ తప్పకుండా ధరించండి. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి” అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ