దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 40 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు, 500 లోపే మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 31,521 కేసులు నమోదు కావడంతో డిసెంబర్ 10, గురువారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 97,67,371 కు చేరుకుంది. కరోనాతో మరో 412 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,41,772 కి పెరిగింది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే 92 లక్షల మందికిపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
ఒకేరోజులో 37,725 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 92,53,306 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 94.74 శాతం గానూ, మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. ప్రస్తుతం 3,72,293 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్ గడ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో కరోనా కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైనా 31,521 కేసులలో 75 శాతం ఈ 10 రాష్ట్రాలలో నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ