ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు డిసెంబర్ 10, గురువారం నాడు సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పర్యవేక్షిస్తున్నారు.
సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన వివరాలు:
- సిద్దిపేట శివారులో ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కుకు శంకుస్థాపన.
- సిద్దిపేట అర్బన్ మండలంలోని పొన్నాలలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం(తెలంగాణ భవన్) ప్రారంభం.
- మిట్టపల్లి రైతువేదిక, విపంచి ఆడిటోరియం ప్రారంభం.
- సిద్దిపేటలో రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రారంభం.
- మెడికల్ కాలేజ్ కు అనుబంధంగా రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన.
- కోమటిచెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన.
- సిద్దిపేట పట్టణ శివారులోని నర్సాపురంలో రూ.163 కోట్లతో పేద ప్రజల కోసం గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం ప్రారంభం.
- సిద్ధిపేట చింతల్చెరువు వద్ద రూ.278 కోట్లతో నిర్మించిన మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ ప్రారంభం.
- రంగనాయకసాగర్ రిజర్వాయర్ వద్ద రూ.8 కోట్లతో నిర్మించిన అతిథి గృహం ప్రారంభం.
- సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ