మహారాష్ట్ర రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఆందోళన నెలకుంది. దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కొత్త కరోనా కేసుల్లో 50 శాతానికిపైగా మహారాష్ట్ర రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్ డౌన్ విధించారు, అలాగే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు పెరుగుదల తగ్గుముఖం పట్టడం లేదు.
ఈ నేపథ్యంలో మార్చి 13, శనివారం నాడు కూడా 15602 కరోనా కేసులు, 88 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,97,793 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 52,811 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 7,467 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 21,25,211 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.49 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.3 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,18,525 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి మహారాష్ట్రలో 1,74,08,504 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ