దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 89 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,82,104 కు చేరుకుంది. మరోవైపు కరోనా వలన మరో 2 మరణాలు (రాజస్థాన్ లో 1, కేరళలో రికాంసైల్డ్ 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,737కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్ణాటకలో 25, కేరళలో 22, తమిళనాడులో 7, మహారాష్ట్రలో 6, ఢిల్లీ, బీహార్, తెలంగాణ లలో 4 చొప్పున నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (2023, జనవరి 24, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 91,45,64,756
- జనవరి 23న నిర్వహించిన కరోనా పరీక్షలు : 1,61,679
- కొత్తగా నమోదైన కేసులు [జనవరి 23–జనవరి 24 (8AM-8AM)] : 89
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,46,82,104
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 90
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,41,49,436
- కరోనా రికవరీ రేటు : 98.81 శాతం
- యాక్టీవ్ కేసులు : 1,931
- కొత్తగా నమోదైన మరణాలు : 2
- మొత్తం మరణాల సంఖ్య : 5,30,737
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE