భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. సోమవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 94 లక్షలు దాటింది. కొత్తగా 38772 పాజిటివ్ కేసులు, 443 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య 94,31,691 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,37,139 కి పెరిగింది. యాక్టీవ్ కేసుల సంఖ్య 5 లక్షల కంటే దిగువగానే కొనసాగుతుంది. ప్రస్తుతం హోమ్ ఐసొలేషన్స్ లో, ఆసుపత్రుల్లో 4,46,952 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు గత 24 గంటల్లో 45,333 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 88,47,600 చేరుకుంది. కరోనా రికవరీ రేటు 93.81 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.45 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 30, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 14,03,79,976
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 94,31,691
- కొత్తగా నమోదైన కేసులు [నవంబర్ 29–నవంబర్ 30 (8AM-8AM)] : 38772
- నమోదైన మరణాలు : 443
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 88,47,600
- యాక్టీవ్ కేసులు : 4,46,952
- మొత్తం మరణాల సంఖ్య : 1,37,139
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ