ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తికాకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. గురువారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలవరంపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని, కిందిస్థాయి అధికారులు చేసిన తప్పుకు మొత్తం ప్రభుత్వాన్నే ఎలా తప్పుబడతారని రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలవల్లే పోలవరం ఇంకా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీగా టీడీపీ విఫలమైందని, చంద్రబాబును ప్రజలు నమ్మరని సజ్జల అన్నారు. సీఎం జగన్ కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించారని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలను కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు తమ ఉనికి కోసమే వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని, ప్రజల వద్దకు వెళ్తే వారికి వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ