తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న ఆమె కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్టు తెలిపారు. వైద్యుల సూచన మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, కరోనా నిబంధనలను పాటించాలని మంత్రి సత్యవతి రాథోడ్ సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ