దేశంలో 66 వేలు దాటిన మరణాలు, ఒకే రోజు 62,026 మంది డిశ్చార్జ్

India has Reported 78,357 Corona Positive Cases, 1045 Deaths in the Last 24 Hours

భారత్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 78357 పాజిటివ్ కేసులు నమోదవగా, 1045 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 2, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 37,69,523 కు, మరణాల సంఖ్య 66,333 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒకే రోజులో 62,026 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 29,01,908 కు చేరుకుంది.

దేశంలో ఓవైపు పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రసుతం కరోనా రికవరీ రేటు 77 శాతం గానూ, మరణాల రేటు 1.8 శాతంగా ఉంది. ప్రపంచంలో ఎక్కువ పాజిటివ్ కేసులు మరియు మరణాలు ఎక్కువుగా నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇక దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 8,01,282 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − three =