కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అన్లాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అంతరాష్ట్ర ప్రయాణాలు, వస్తు రవాణాపై ఎలాంటి నిబంధనలను ఉండకూడదని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్యలో ప్రయాణం లేదా రవాణాకు ప్రత్యేక అనుమతి, ఆమోదం లేదా ఈ-పాస్ అవసరం లేదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేందుకు ప్రవేశపెట్టిన ఈ-పాస్ నిబంధనను తొలగించారు. ఇక ఈ-పాస్ లేకుండానే ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి ప్రజలు ప్రయాణాలు కొనసాగించవచ్చు. అందులో భాగంగా సరిహద్దుల్లోని చెక్పోస్టులను అధికారులు తొలగించారు. కాగా పలు కార్యకలాపాలపై నిఘా నేపథ్యంలో సరిహద్దుల వద్ద రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలను తనిఖీ చేసి అనుమతిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu