దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు 11 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నప్పటికీ, కేసుల్లో కొంత హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 2.49 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 11,793 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 28, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,18,839 కు చేరుకుంది. అలాగే గత 24 గంటల్లో కరోనాతో 27 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,25,047 కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, పశ్చిమబెంగాల్, తెలంగాణ, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దేశంలో 96,700 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.57 శాతం:
దేశంలో ప్రస్తుతం 96,700 (0.22%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 9,486 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,27,97,092 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.57 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ఇక జూన్ 27, సోమవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 86.14 కోట్లకు (86,14,89,400) చేరుకుంది. జూన్ 27న 4,73,717 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY