దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో మొత్తం 3,52,166 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 7,231 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 2.05 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,44,28,393 కు చేరుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, హర్యానా, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి.
అలాగే కొత్తగా మరో 45 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,27,874 కి పెరిగింది. మరో 10,828 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,38,35,852 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.67 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 64,667 (0.15%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY