దేశంలో గత 24 గంటల్లో 2,31,622 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 2,401 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 1.04 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,28,828 కు చేరుకుంది. అలాగే కొత్తగా మరో 21 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,28,895 కి పెరిగింది. మరో 2,373 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,40,73,308 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 26,625 (0.06%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (అక్టోబర్ 15 (8am)–అక్టోబర్ 16 (8am)):
- కేరళ – 485
- మహారాష్ట్ర – 462
- తమిళనాడు – 285
- పశ్చిమబెంగాల్ – 173
- కర్ణాటక – 163
- ఢిల్లీ – 135
- తెలంగాణ – 78
- గుజరాత్ – 68
- ఒడిశా – 63
- ఛత్తీస్ గడ్ – 63.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY