దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,68,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,68,50,962 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 402 మంది మరణించడంతో మరణాల సంఖ్య 4,85,752 కి పెరిగింది. ప్రస్తుతం 14,17,820 (3.85%) మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక దేశంలో మరో 1,22,684 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 3,49,47,390 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 94.83 శాతంగానూ, మరణాల రేటు 1.32 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6,041 కు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ఉదయం వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ