దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు మూడు వేల లోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,756 పాజిటివ్ కేసులు, 21 మరణాలు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో అక్టోబర్ 9, ఆదివారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,46,12,013 కు, మరణాల సంఖ్య 5,28,799 కి పెరిగిందని తెలిపారు.
అలాగే గత 24 గంటల వ్యవధిలో 3,393 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,40,54,621 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.75 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 28,593 (0.06%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా దేశంలో గత 24 గంటల్లో 2,39,546 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 89.69 కోట్లు దాటింది. రోజువారీ పాజీటివిటీ రేటు 1.15 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY