దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కొత్తగా 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,46,85,132కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ (30), కర్ణాటక (16), మహారాష్ట్ర (11), తమిళనాడు (10) తెలంగాణ (9) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,761 గా ఉంది.
ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య 1,921 కు చేరుకుంది. అలాగే మరో 90 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,52,450 కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.81 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఫిబ్రవరి 21, మంగళవారం ఉదయం 8 గంటల వరకు 220.63 కోట్లకుపైగా (220,63,46,917) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE