దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 4,12,262 కరోనా పాజిటివ్ కేసులు, 3980 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,10,77,410 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,30,168 కి పెరిగింది. కరోనా వ్యాప్తి వెలుగులోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా రోజువారీగా నమోదయిన కరోనా కేసుల సంఖ్యలో ఇదే (4,12,262) అత్యధికం. అలాగే దేశంలో 24 గంటల వ్యవధిలో చోటుచేసుకున్న కరోనా మరణాల సంఖ్యలో (3980) కూడా ఇదే అత్యధికం.
ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, హర్యానా వంటి 10 రాష్ట్రాల్లోనే గత 24 గంటల్లో కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 35,66,398 (16.92%) చేరువైంది. మరో 3,29,113 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,72,80,844 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 81.99 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.09 శాతంగా నమోదైంది. కాగా గత 24 గంటల్లో నాగాలాండ్, లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 5 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (మే 6, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 29,67,75,209
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 2,10,77,410
- కొత్తగా నమోదైన కేసులు [మే 5– మే 6 (8AM-8AM)] : 4,12,262
- నమోదైన మరణాలు : 3980
- రికవరీ అయిన వారి సంఖ్య : 1,72,80,844
- యాక్టీవ్ కేసులు : 35,66,398
- మొత్తం మరణాల సంఖ్య : 2,30,168
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ