దేశంలో నేటితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్లు దాటింది. అమెరికా తర్వాత అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు భారత్ లోనే నమోదయ్యాయి. కాగా కరోనా నుంచి కోలుకున్నవారి దాదాపు 2.9 కోట్లకు (2,89,94,855) చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.56 శాతంగా నమోదైంది. వరుసగా 41వ రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు కంటే రికవరీలు ఎక్కువుగా ఉన్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 50,848 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,28,709 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 1358 మంది మరణించడంతో మరణాల సంఖ్య 3,90,660 కి పెరిగింది. ప్రస్తుతం 6,43,194 మంది కరోనా బాధితులు హోం ఐసోలేషన్ లలో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
కొత్తగా కేరళ (12,617), మహారాష్ట్ర (8,470), తమిళనాడు (6,895), ఆంధ్రప్రదేశ్ (4,169), కర్ణాటక (3,709), ఒడిశా (2,957), అస్సాం (2,869), వెస్ట్ బెంగాల్ (1,852), తెలంగాణ (1,175), ఛత్తీస్ గడ్ (482) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో మరో 68,817 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 2,89,94,855 కు చేరుకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ