దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 10,256 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,43,89,176 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 68 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,27,556 కు పెరిగింది. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 31 మరణాలు నివేదించబడినట్టు తెలిపారు. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 1887, కర్ణాటకలో 1286, కేరళలో 1186, ఢిల్లీలో 702, తమిళనాడులో 542, ఉత్తర్ ప్రదేశ్ లో 501, హర్యానాలో 496, రాజస్థాన్ 442లో నమోదయ్యాయి. ఇక తెలంగాణలో గత 24 గంటల్లో 298, ఆంధ్రప్రదేశ్ లో 120 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు వివరాలు (ఆగస్టు 26, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 88,43,39,045
- ఆగస్టు 26న నిర్వహించిన కరోనా పరీక్షలు : 4,22,322
- కొత్తగా నమోదైన కేసులు [ఆగస్టు 25–ఆగస్టు 26 (8AM-8AM)] : 10,256
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,43,89,176
- కొత్తగా కోలుకున్నవారి సంఖ్య: 13,528
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,37,70,913
- కరోనా రికవరీ రేటు : 98.61 శాతం
- యాక్టీవ్ కేసులు : 90,707 (0.20 శాతం)
- కొత్తగా నమోదైన మరణాలు : 68
- మొత్తం మరణాల సంఖ్య : 5,27,556
- కరోనా మరణాల రేటు: 1.19 శాతం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY