దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. రోజువారీ కరోనా కేసులు 20 వేలకుపైగానే నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 21,566 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,38,25,185 కు చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 2667, పశ్చిమబెంగాల్ లో 2455, మహారాష్ట్రలో 2325, తమిళనాడులో 2116 నమోదయ్యాయి. అలాగే కరోనాతో మరో 45 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,25,870 కు పెరిగింది. కరోనా రికవరీ రేటు 98.47 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది. మరోవైపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య లక్ష 48 వేలు (1,48,881 – 0.33%) దాటింది. మరో 18,294 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,31,50,434 కు చేరుకుంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 21, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 87.11 కోట్లు
- జూలై 20న నిర్వహించిన కరోనా పరీక్షలు :5,07,360
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,38,25,185
- కొత్తగా నమోదైన కేసులు [జూలై 20–జూలై 21 (8AM-8AM)] : 21,556
- నమోదైన మరణాలు : 45
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,31,50,434
- యాక్టీవ్ కేసులు : 1,48,881
- మొత్తం మరణాల సంఖ్య :5,25,870
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY