దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,45,384 కరోనా పాజిటివ్ కేసులు, 794 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,32,05,926 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,68,436 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లోనే 82.82 శాతం కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరగడంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 10,46,631 (7.93%) కు చేరుకుంది. మరో 77,567 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 1,19,90,859 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 90.80 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.28 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలివే (ఏప్రిల్ 9 8am–ఏప్రిల్ 10 8am) :
- మహారాష్ట్ర – 58993
- ఛత్తీస్ ఘడ్ – 11447
- ఉత్తరప్రదేశ్ – 9587
- ఢిల్లీ – 8521
- కర్ణాటక – 7955
- తమిళనాడు – 5441
- కేరళ – 5063
- మధ్యప్రదేశ్ – 4882
- గుజరాత్ – 4541
- రాజస్థాన్ – 3970
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన రాష్ట్రాలివే:
- మహారాష్ట్ర – 301
- ఛత్తీస్ ఘడ్ – 91
- పంజాబ్ – 56
- కర్ణాటక – 46
- గుజరాత్ – 42
- ఢిల్లీ – 39
- ఉత్తర్ ప్రదేశ్ – 36
- రాజస్థాన్ – 32
- తమిళనాడు – 23
- మధ్యప్రదేశ్ – 23
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ