ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 31,929 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 3309 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. ఏప్రిల్ 10, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,21,906 కు చేరుకుంది. ఇక కరోనా వలన చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపూర్, గుంటూరు మరియు కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 7291 కి పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 1053 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 8,95,949 కు చేరింది. అలాగే ప్రస్తుతం 18666 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 1,53,97,672 కరోనా పరీక్షలను నిర్వహించారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(3309):
- తూర్పుగోదావరి – 111
- కర్నూల్ – 296
- కృష్ణా – 278
- కడప – 124
- గుంటూరు – 527
- చిత్తూరు – 740
- అనంతపూర్ – 133
- నెల్లూరు – 133
- ప్రకాశం – 174
- శ్రీకాకుళం – 279
- విశాఖపట్నం – 391
- విజయనగరం – 97
- పశ్చిమగోదావరి – 26
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ