దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో మొత్తం 3,25,081 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 16,047 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 4.94 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,41,90,697 కు చేరుకుంది. అలాగే కొత్తగా మరో 54 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,26,826 కి పెరిగింది.
కొత్తగా నమోదైన కేసుల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, హర్యానా, కేరళ, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, అస్సాం వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 19,539 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,35,35,610 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.52 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో 1,28,261 (0.29%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (ఆగస్టు 9 (8am)–ఆగస్టు 10 (8am)):
- ఢిల్లీ – 2495
- మహారాష్ట్ర – 1782
- కర్ణాటక – 1608
- ఉత్తర్ ప్రదేశ్ – 942
- తమిళనాడు – 941
- హర్యానా – 922
- కేరళ – 897
- గుజరాత్ – 678
- జమ్మూ కాశ్మీర్ – 626
- రాజస్థాన్ – 580
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY