దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. వరుసగా మూడో రోజు కూడా 18 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,599 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,29,398 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 97 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,57,853 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,88,747 (1.68%) యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా మహారాష్ట్ర (11141), కేరళ (2100), పంజాబ్ (1043) లలో 1,000 కి పైగా కొత్త కేసులను నమోదయ్యాయి. గత 24 గంటల్లో అస్సాం, చండీగర్, గోవా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ అండ్ నికోబర్, దాద్రా మరియు నగర్ హవేలి మరియు డామన్ మరియు డయ్యు వంటి 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలాంటి కరోనా మరణాలు నివేదించబడలేదు.
దేశంలో కరోనా రికవరీ రేటు 96.91 శాతం, మరణాల రేటు 1.41 శాతం:
అలాగే మరో 14,278 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 1,08,82,798 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 96.91 శాతం గానూ, మరణాల రేటు 1.41 శాతంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలలో రోజువారీ కరోనా కేసులు నమోదు ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన 18,599 కేసులలో 86.25 శాతం ఈ 6 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ