తమిళనాడుకు వెళ్లేందుకు 3 రాష్టాలవారికి మినహా, మిగతావారికి ఈ-పాస్ ఉండాల్సిందే

Coronavirus in Tamil Nadu, Tamil Nadu, Tamil Nadu Corona Cases, Tamil Nadu Corona Deaths, Tamil Nadu Corona Positive Cases, Tamil Nadu Coronavirus, Tamil Nadu Coronavirus Cases, Tamil Nadu Coronavirus News, Tamil Nadu Coronavirus Updates, Tamil Nadu Covid-19 Cases, Tamilnadu Govt, Tamilnadu Govt Makes Auto ePass Mandatory, Tamilnadu Govt Makes Auto ePass Mandatory for Enter into the State

దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో మళ్ళీ పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కర్ణాటక నుంచి వచ్చే వారికీ మినహా ఇతర రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు నుంచి వచ్చే దేశీయ ప్రయాణికులందరికీ మరియు అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ-పాస్ తప్పనిసరి చేస్తూ తమిళనాడు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారిక వెబ్ సైట్ లో ఈ-పాస్ ఆటోమేటిక్ గా జారీచేయబడుతుందని రాష్ట్రప్రభుత్వ విభాగాల నుంచి ఎటువంటి క్లియరెన్స్ అవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అలాగే బిజినెస్ వ్యవహారాలపై 72 గంటల లోపు ఉండేలా రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు హోమ్ క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల పాటుగా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని పేర్కొన్నారు. ఇటీవల కొన్నిరోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి ద్వారానే కరోనా కేసులు పెరుగుతున్నట్టు తేలిన నేపథ్యంలోనీ తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,55,121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 8,38,606 మంది కరోనా నుంచి కోలుకోగా, 12,518 మంది మరణించారు. ప్రస్తుతం 3,997 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − seven =