దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 215 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,72,068 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (83), కర్ణాటక (46), మహారాష్ట్ర (23), తమిళనాడు (22), పశ్చిమబెంగాల్ (7), రాజస్థాన్ (7) వంటి 5 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే మరో కరోనా వలన మరొకరు మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,30,615కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య 5 వేల దిగువకు (4,982 (0.01%)) చేరుకుంది.
మరోవైపు కొత్తగా 355 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,36,471 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.80 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా నవంబర్ 29, మంగళవారం ఉదయం 8 గంటల వరకు 219.91 కోట్లకుపైగా (2,19,91,45,842) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 53,295 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE