ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2745 కరోనా పాజిటివ్ కేసులు, 13 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 5, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,35,953 కు చేరగా, కరోనా వలన మరణించిన వారి సంఖ్య 6757 కి పెరిగింది. మరో 2292 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో 85,364 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించారు. ఇక కరోనా వలన కృష్ణాలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరులో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు, ప్రకాశంలో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, అనంతపూర్ లో ఒకరు మరియు తూర్పుగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6757 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 5, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 84,27,629
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,35,953
- కొత్తగా నమోదైనా కేసులు : 2745
- నమోదైన మరణాలు : 13
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,07,318
- యాక్టీవ్ కేసులు : 21878
- మొత్తం మరణాల సంఖ్య : 6757
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ