దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా ఎనిమిదో రోజు 3 లక్షల కంటే తక్కువుగానే కేసులు నమోదవగా, వరుసగా పదకొండో రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు కంటే రికవరీలు ఎక్కువుగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు మాత్రం భారీ సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,22,315 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,67,52,447 కు చేరుకుంది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 4454 మంది మరణించడంతో మరణాల సంఖ్య 3,03,720 కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 27,20,716 (10.17%) యాక్టీవ్ కేసుల ఉన్నాయి.
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో 81 శాతం 10 రాష్ట్రాల్లోనే:
కొత్తగా తమిళనాడు (35,483), మహారాష్ట్ర (26,672), కర్ణాటక (25,979), కేరళ (25,820), ఆంధ్రప్రదేశ్ (18,767), వెస్ట్ బెంగాల్ (18,422), ఒడిశా (12,852), రాజస్థాన్ (6,521), పంజాబ్ (5,021), ఉత్తర్ ప్రదేశ్ (4,715) వంటి 10 రాష్ట్రాల్లోనే కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2,22,315 కేసులలో 81.08 శాతం ఈ 10 రాష్ట్రాలలోనే నివేదించబడ్డాయి. ఇక దేశంలో మరో 3,02,544 మంది బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి సంఖ్య 2,37,28,011 కు చేరుకుంది. ప్రస్తుతం రికవరీ రేటు 88.69 శాతం గానూ, మరణాల రేటు 1.14 శాతంగా ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ