దేశంలో గత 24 గంటల్లో మరో 226 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,78,384కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (81), కర్ణాటక (45), మహారాష్ట్ర (18), ఉత్తర్ ప్రదేశ్ (15), తమిళనాడు (14) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే మరో 179 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,41,44,029 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.80 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.
220.10 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ:
మరోవైపు కరోనా వలన మరో 3 మరణాలు (కేరళలో రికాంసైల్డ్ 3) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,702కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి యాక్టీవ్ కేసుల సంఖ్య 3,653 (0.01%) కు చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా డిసెంబర్ 31, శనివారం ఉదయం 8 గంటల వరకు 220.10 కోట్లకుపైగా (2,20,10,06,278) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయి. ముందు రోజున 91,732 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE