దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 41,649 కేసులు, 593 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,13,993 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,23,810 కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, అస్సాం, మణిపూర్, మిజోరాం, వెస్ట్ బెంగాల్ వంటి 10 రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 37,291 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 3,07,81,263 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 97.37 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.34 శాతంగా నమోదైంది.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలివే (జూలై 30 8am–జూలై 31 8am):
- కేరళ – 20772
- మహారాష్ట్ర – 6600
- ఆంధ్రప్రదేశ్ – 2068
- తమిళనాడు – 1947
- కర్ణాటక – 1890
- ఒడిశా – 1558
- అస్సాం – 1179
- మణిపూర్ – 874
- మిజోరాం – 774
- వెస్ట్ బెంగాల్ – 711
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ