ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

4 new government colleges to be established, 4 new govt colleges to be set up in erstwhile Rangareddy, 4 new govt colleges to be set up in erstwhile Rangareddy district, CM KCR sanctions 4 government degree colleges in Rangareddy, Govt Degree Colleges for Rangareddy, List of Degree colleges in Ranga Reddy District, Mango News, Telangana Govt Sanctioned 4 New Govt Degree Colleges, Telangana Govt Sanctioned 4 New Govt Degree Colleges for Rangareddy District, Top Government Colleges in Rangareddy

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఉప్పల్, మహేశ్వరం, వికారాబాద్, పరిగి ప్రాంతాలల్లో నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు మంజూరు అయినట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. డిగ్రీ కాలేజీలు మంజూరు చేయడం పట్ల ఆ ప్రాంత ప్రజలు, విద్యార్థుల తరపున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు మొదలుపెట్టి, తరగతులు ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − four =