దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45,951 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,03,62,848 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 817 మంది మరణించినట్టు తెలిపారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 3,98,454 కు చేరుకుంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఒడిశా, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్ గడ్ వంటి 10 రాష్ట్రాల్లోనే గత 24 గంటల్లో కొత్త కేసులు ఎక్కువుగా నమోదు అయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం 5,37,064 (1.77%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 60,729 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 2,94,27,330 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 96.92 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.31 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూన్ 30, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య: 41,01,00,044
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 3,03,62,848
- కొత్తగా నమోదైన కేసులు [జూన్ 29–జూన్ 30 (8AM-8AM)] : 45,951
- నమోదైన మరణాలు : 817
- రికవరీ అయిన వారి సంఖ్య : 2,94,27,330
- యాక్టీవ్ కేసులు : 5,37,064
- మొత్తం మరణాల సంఖ్య : 3,98,454
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ