ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కృష్ణానది కరకట్ట రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పనులకు సంబంధించిన పైలాన్ ను కూడా కూడా సీఎం జగన్ ఆవిష్కరించారు. ప్రకాశం బ్యారేజీ వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ మేర చేపట్టనున్న ఈ రహదారి విస్తరణ పనులకు ఏపీ ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేయనుంది. అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టనున్నారు. కరకట్టపై 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారితో పాటు పాదచారులు నడిచేందుకు వీలుగా రెండు వైపులా 1.50 మీటర్ల మేర ఇరువైపులా దారులను ఏర్పాటు చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, మేకతోటి సుచరిత సహా పలువురు రాష్ట్ర మంత్రులు, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ