దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 10,649 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 24, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,68,195 కు చేరుకుంది. దీంతో రోజువారీ పాజిటివిటీ రేటు 2.62 శాతంగా నమోదైంది. అలాగే కరోనాతో మరో 36 మంది మరణించడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,27,452 కి పెరిగింది. ఇక ఆగస్టు 23, మంగళవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 88.35 కోట్లకు (88,35,23,886) చేరుకుంది. ఆగస్టు 23న 4,07,096 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
దేశంలో 96,442 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.59 శాతం:
దేశంలో ప్రస్తుతం 96,442 (0.22%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 10,677 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,37,44,301 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.59 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, కేరళ, హర్యానా, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY