ఆగస్టు 10 నాటికీ దేశంలో కరోనా కేసులు 20 లక్షలు దాటతాయి

Coronavirus Deaths In India, Coronavirus In India, Coronavirus outbreak, Coronavirus Positive Cases In India, india coronavirus cases, india coronavirus deaths, rahul gandhi, Rahul Gandhi About Coronavirus, Rahul Gandhi Coronavirus, Rahul Gandhi Latest News

జూలై 17, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10,03,832 కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా కేసుల పెరుగుదలకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా మరోసారి స్పందించారు. “దేశంలో 10 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో, ఆగస్టు 10 నాటికి దేశంలో 20,00,000 మందికి పైగా వ్యాధి సోకే అవకాశం ఉంది. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్మాణాత్మకమైన, ప్రణాళికబద్ధమైన చర్యలు తీసుకోవాలని” రాహుల్ గాంధీ ట్వీట్ లో పేర్కొన్నారు. అదే విధంగా ఈ వారంలో దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటుతుందని జూలై 14 న చేసిన ట్వీట్ ను ఆయన ట్యాగ్ చేశారు. ఇప్పటికే కరోనా వ్యాప్తిపై రాహుల్ గాంధీ పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్నిహెచ్చరించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =