దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో మొత్తం 89,078 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1300 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 1.46 శాతంగా నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,99,418 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో మూడు మరణాలు (గుజరాత్ లో 1, మహారాష్ట్రలో 1, కర్ణాటకలో 1) నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,816కి పెరిగింది. కాగా మరో 718 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,41,60,997 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.79 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. మరోవైపు ప్రస్తుతం దేశంలో 7,605 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోనే కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. కాగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా ఎలాంటి కేసులు నమోదవలేదు.
గత 24 గంటల్లో కరోనాకేసులు ఎక్కువగా నమోదైన 5 రాష్ట్రాలివే (మార్చి 22 (8am)–మార్చి 23 (8am)):
- మహారాష్ట్ర – 334
- గుజరాత్ – 247
- కేరళ – 172
- కర్ణాటక – 105
- ఢిల్లీ – 84.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE